Thursday, May 2, 2024

TS – బాలుడి అదృశ్యం విషాదాంతం – నాలాలో మృతదేహం లభ్యం

అదృశ్యమైన బాలుడి కథ విషాదంగా ముగిసింది. నాలాలో శవంగా తేలడం పలువురిని కలిచివేసింది. వివరాల్లోకి వెళ్తే.. కార్తిక్‌(10) అనే బాలుడు మంగళవారం రాత్రి ఆడుకుంటూ మాయమయ్యాడు. తల్లిందండ్రులు ఎంత వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, జూబ్లీహిల్స్ పరిధి దుర్గా భవానీనగర్‌ నాలాలో బుధవారం కార్తిక్‌ మృతదేహం లభ్యమైంది. ఎవరైనా చంపారా? లేదా ప్రమాదమా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బాలుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement