Sunday, April 28, 2024

TS: డిసెంబర్ 9న రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభ: రేవంత్ రెడ్డి

డిసెంబర్ 9న రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో 30 లక్షల సభ్యత్వాలు కంప్లీట్ చేస్తామని అధినేత్రి సోనియాగాంధీకి మాట ఇిచ్చినట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం అంటే కాంగ్రెస్ కుటుంబంలో సభ్యుడు కావడమేనన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి రూ. 2 లక్షల జీవిత బీమా వర్తిస్తుందని తెలిపారు.

దేశ బానిస సంకెళ్లను తెంచింది కాంగ్రెస్ పార్టీనే అని.. దేశం కోసం ఎన్నో త్యాగాలను చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అన్నారు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీలాంటి గొప్ప నాయకుడు పార్టీలో సభ్యుడినని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంటుందని అన్నారు. పార్టీ కార్యకర్తలకు ఈ నెల 9 నుంచి శిక్షణ కార్యక్రమాలను ప్రారంభిస్తామని చెప్పారు. 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జన జాగరణ యాత్ర ఉంటుందని తెలిపారు.

కాగా, డిసెంబర్ 9న భారీ బహిరంగసభ నిర్వహిస్తామన్నారు టీపీసీసీ చీఫ్. పోలీసులు పర్మిషన్ ఇస్తే హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సభ నిర్వహిస్తామని, ఇవ్వకపోతే నగర శివారలో నిర్వ‌మించ‌నున్న‌టుట తెలిపారు. ఈ సభకు రాహుల్ గాంధీ వస్తారని చెప్పారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పారు రేవంత్‌..

Advertisement

తాజా వార్తలు

Advertisement