Thursday, May 2, 2024

స్టాలిన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం..అసెంబ్లీ క్యాంటీన్ మూసివేత‌..

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ పేరు దేశ‌మంత‌టా మారు మ్రోగుతోంది. ఆయ‌న తీసుకునే నిర్ణ‌యాలకు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు కూడా ఫిదా అవుతున్నారంటేనే అర్థ‌మ‌వుతోంది ఆయ‌న స‌త్తా ఏంటో..అంద‌రిని క‌లుపుకుని పోతూ ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ప‌ర‌మావ‌ధిగా ముందుకు సాగుతున్నారు స్టాలిన్. ఆయ‌నని మిగ‌తా వారు కూడా ఫాలో అయితే ఆ రాష్ట్రాల‌కు మేలు క‌ల‌గ‌డం త‌థ్య‌మ‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. పొగ‌డ్త‌లు వ‌ల‌ద‌ని..సొంత పార్టీ నేత‌ల‌కి చెప్ప‌డం..త‌న ప‌ని తాను చేసుకుపోవ‌డం ఆయ‌న సింప్లి సిటీ ఇవ‌న్నీ ఆచ‌రించ‌ద‌గిన‌వే. అధికారం చేపట్టినప్పటి నుండి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ సొంత రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది మొదలు ప్రతి పని కూడా ప్రజలని దృష్టిలో పెట్టుకుని ప్రజలకి ఏది మేలో ఆలోచిస్తూ ముందుకి సాగుతున్నారు స్టాలిన్. ఇక ఇప్పుడు ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ క్యాంటీన్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారాయ‌న‌. ఇకపై అసెంబ్లీకి వచ్చే మంత్రులు.. ఎమ్మెల్యేలు ఎవరి భోజన ఏర్పాట్లు వారే చూసుకోవాలని స్పష్టం చేశారు. క్యాంటీన్ మూసివేస్తున్నందున ప్రజా ప్రతినిధులు వారి ఇళ్ల నుంచే భోజనాలు తెచ్చుకోవాలని తెలియ‌జేశారు. ఇప్పుడు ఈయ‌న చేసిన ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.

వృధా ఖర్చులు.. దుబారా ఖర్చులతోపాటు విలువైన సమయాన్ని వృధా చేసే అవకాశం ఉన్న విధానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేసే రీతిలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన తాజాగా అసెంబ్లీ ప్రాంగణంలోని క్యాంటీన్ ను మూసివేయాలని ఆదేశించారు. తనకు ప్రధాన ప్రతిపక్షమైనప్పటికీ అన్నా డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటీన్లను కొనసాగిస్తున్న ఆయన తన కాన్వాయ్ వల్ల ప్రజల ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతోందని భావించి కాన్వాయ్ లో వాహనాల సంఖ్యను బాగా తగ్గించుకున్నారు. తనను పొగుడుతూ ఎవరూ మాట్లాడొద్దని మరీ ముఖ్యంగా అసెంబ్లీలో సమస్యలు ప్రజాహిత కార్యక్రమాల గురించే మాట్లాడాలని సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులను ఆదేశించి అమలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement