Wednesday, May 1, 2024

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను..అఖిలేష్ యాద‌వ్ సంచ‌ల‌న నిర్ణ‌యం..

యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోన‌ని అఖిలేష్ ప్ర‌క‌టించారు. 2022మార్చిలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రానున్న అసెంబ్లీ పోరులో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డి)తో పొత్తును ఖరారు చేశారు అఖిలేష్‌ యాదవ్‌.. సీట్ల పంపకంపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో యూపీ ముఖ్యమంత్రి బరిలో ఉంటారని భావిస్తున్న తరుణంలో అఖిలేష్‌ యాదవ్‌ చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మ‌రి ఇదే నిర్ణ‌యం ఫైనల్ చేస్తారా లేక త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంటారా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement