Tuesday, May 7, 2024

AP: బ‌ద్వేల్ కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి.. 28 టేబుల్స్‌ 10 రౌండ్లలో లెక్కింపు..

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ తెలిపారు. మంగళవారం కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సందర్భంగా.. ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ మీడియాతో మాట్లాడుతూ.. 281 పోలింగ్ కేంద్రాలకు ఒకే చోట కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేశాం. కౌంటింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేశాం. నాలుగు హాళ్లలో 28 టేబుల్స్ ఏర్పాటు చేసి ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించడం జరుగుతంది. కొన్ని టేబుళ్లు పెరిగే అవకాశం ఉంది. కౌంటింగ్ సూపర్ వైజర్, మైక్రో అజ్వర్వర్ల పర్యవేక్షణలో కౌంటింగ్ నిర్వ‌హిస్తాం. పోస్టల్ బ్యాలెట్ 233, సర్వీస్ ఓటర్లు ముందుగా లెక్కగడుతాం. అని వివ‌రించారు. వీటి ఫలితాలు 8 గంటల తర్వాత వస్తాయన్నారు.

మొత్త పది రౌండ్స్ లో ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 10 గంటలకే కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో తామే గెలుస్తామ‌ని ధీమా వ్యక్తం చేసింది వైసీపీ పార్టీ. మెజార్టీ మాత్రం తగ్గిస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2, 15, 392 ఉండగా… 1,46,562 ఓట్లు పోలయ్యాయి.

2019 ఎన్నికల్లో బద్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నుంచి పోటీచేసి గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్ర‌స్తుతం బద్వేల్‌ బరిలో 15మంది అభ్యర్ధులున్నా… ప్రధాన పోటీ మాత్రం వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే సాగింది. గత ఎన్నికల్లో లక్షా 58వేల ఓట్లు పోలైతే అందులో 60శాతం ఓట్లు ఒక్క వైసీపీకే వచ్చాయ్. బీజేపీ, కాంగ్రెస్‌కి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement