Friday, April 26, 2024

TS : టీఎస్ ఐసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల…రేప‌టి నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్లు…

కాకతీయ యూనివర్సిటీ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్ 2024 నోటిఫికేషన్‌నువిడుదల చేసింది. రేప‌టి నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 30 వరకు ఆన్ లైన్ లో ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అప్లై చేసుకోవచ్చు.

జూన్ 4, 5 తేదీల్లో మొత్తం 3 సెషన్లలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.550 కాగా, ఇతరులకు రూ.750 గా నిర్ణయించారు. అపరాధ రుసుంలో మే నెల 17 వరకు అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించారు. సీబీటీ విధానంలో పరీక్ష జరగనుండగా మే 20వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కాగా జూన్ 28 న తుది ఫలితాలు విడుదల కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement