Sunday, April 28, 2024

TS – స్కాన్ ఎనర్జీలో భారీ పేలుడు – ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు

రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలోని స్కాన్ ఎనర్జీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. పనిలో నిమగ్నమైన కార్మికులపై వేడి ద్రవం పడినట్లు స‌మాచారం. తీవ్రంగా గాయపడిన కార్మికులను చికిత్స కోసం షాద్ నగర్‌కు త‌ర‌లించారు. ఈ పేలుడుతో పరిశ్రమ మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. కార్మికులు భ‌యంతో బయటికి పరుగులు తీశారు. ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు స‌మాచారం అందించ‌డంతో హుటాహుటిన త‌ర‌లివెళ్లారు. పోలీసులు కూడా అక్క‌డ‌కు చేరుకుని స‌హాయ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement