Saturday, April 27, 2024

TS: గాంధీభవన్ లో పాలకుర్తి లొల్లి..

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి తీరుకు వ్యతిరేకంగా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ ముందు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దేవరుప్పుల మండల పార్టీ అధ్యక్షుడి తొలగింపుతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాలకుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. పేరుకే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అయినా పెత్తనం మాత్రం అత్త ఝాన్సీరెడ్డి చేస్తుందని కార్యకర్తలు అంటున్నారు.

మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారికి ప్రియారిటీ ఇవ్వకుండా నిన్న.. మొన్న వేరే పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వారికి ప్రియారిటీ ఇస్తుందని కార్యకర్తలు పేర్కొంటున్నారు. దేశ పౌరసత్వం లేనప్పటికీ, పార్టీలో ఎలాంటి పదవి లేనప్పటికీ పార్టీ శ్రేణులకు షోకాజ్ నోటీసులు ఇస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరులను పక్కనబెట్టుకొని సొంత పార్టీ నేతలపై కక్షపూరితంగా ఝాన్సీరెడ్డి వ్యవహారం ఉందని పార్టీ శ్రేణులు నిరసన తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement