Sunday, May 19, 2024

TS – ఓట్ల కోస‌మే రామ మందిరం -మోదీపై విరుచుకుపడ్డ సిపిఐ నారాయణ…

హైదరాబాద్ – అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తి కాకముందే మోదీ ప్రారంభించార‌ని, ఇది అగమశాస్త్ర నిబంధనలకి వ్యతరేకమని అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రామమందిరం అంశం ప్రజల్లోకి వెళ్ళకపోవడంతో మోదీ గ్యారంటి తెరపైకి తీసుకువచ్చారన్నారు. మంగళసూత్రం ఉపయోగించి ఓట్లని రాబట్టుకోవాలని చూస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు.. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఇండియాకూటమి గెలిస్తే ముస్లిం రిజర్వేషన్ తీసుకువస్తున్నారని ప్రచారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు..

మోడీ కట్టిన మంగళసూత్రానికే విలువలేకుండా పోయిందన్నారు. ఆయ‌న‌ పదేండ్లలలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని, స్విస్ బ్యాంకు తీసుకువచ్చిన నల్లధనం ఎంత? అని ప్రశ్నించారు. మోదీ ఇంటిపేరు గల వ్యక్తులే డబ్బులు ఎత్తుకెళ్ళిపొయారని కీలక వ్యాఖ్యలు చేశారు. వీరంతా మోడీ దత్త పుత్రులే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ వచ్చిన తరువాత డబ్బులు తిన్నవారు ఒకరూ జైలుకి వెళ్ళలేదన్నారు.

- Advertisement -

గుజరాత్ గంజాయి స్మగ్లర్.ఆదాని ఆస్తులు పెరగడానికి కారణం మోదీనే అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక నల్లధనం వైట్ మనీ అయ్యిందన్నారు. అందాల పోటీ, ప్యాషన్ పోటీ పెడితే మోదీకి ప్రథమ బహుమతి వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ని జైలుకి పంపాలని చూస్తున్నార‌ని నారాయ‌ణ అన్నారు. రేవంత్ రెడ్డి ని అరెస్టు చేస్తే రేవంత్ చెట్టంత ఎదుగుతాడన్నారు.

రాజ్యాంగాన్ని మార్చడానికే నాలుగు వందల సీట్లు గెలవాలని మోదీ చూస్తున్నార‌న్నారు. అనుకూలంగా ఉన్నవారిని గెలిపించడానికి ఈసిని కూడ మోదీ వాడుకుంటున్నార‌ని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ఫైట్ నడుస్తుందన్నారు. కేసీఆర్ అహంకారం, అహంభావం కారణంగా బీఆర్ఎస్ ఖేల్ ఖతం అయ్యిందన్నారు. కేసీఆర్ తెలంగాణలో గెలిచే దిక్కు లేదు కాని.. హంగ్ వస్తది, మేము కీలకం అని మాట్లాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టంలోని ఒక్క హామీలు బీజేపీ అమలు చేయలేదన్నారు. తెలంగాణకి బద్ధ శత్రువు బీజేపీ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement