Saturday, May 4, 2024

ఆకర్షిస్తోన్న టిఆర్ ఎస్ పోస్ట‌ర్స్ -దేశ్ కి నేత కేసీఆర్

నేడు తెలంగాణ‌భ‌వ‌న్ లో జ‌ర‌గ‌నున్న స‌ర్వ‌స‌భ్య‌స‌మావేశం నేతృత్వంలో టీఆర్ ఎస్ నేత‌లు ఏర్పాటు చేసిన పోస్ట‌ర్లు అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటున్నాయి. జై బోలో దేశ్ కి నేత కేసీఆర్ అని భారీ పోస్ట‌ర్లు వెలిశాయి. తెలంగాణ పార్టీ ఇప్పుడు భార‌త రాష్ట్ర స‌మితిగా ఆవిర్భ‌వించ‌నున్న విష‌యం తెలిసిందే. దేశం ద‌శ‌దిశ‌ను మార్చేందుకు సీఎం కేసీఆర్ కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ల‌నున్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ అమ‌లు చేస్తున్న విధానాల‌కు వ్య‌తిరేకంగా సీఎం కేసీఆర్ త‌నదైన శైలిలో పోరాటం మొద‌లు పెట్ట‌నున్నారు. విజ‌య ద‌శ‌మి వేళ నూత‌న పార్టీని ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు కేసీఆర్‌కు విషెస్ చెబుతూ టీఆర్ఎస్ నేత‌లు సిటీలో బ్యాన‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 1.19 నిమిషాల‌కు సీఎం కేసీఆర్ అత్యంత కీల‌క‌మైన ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. దేశ ప్ర‌గ‌తికి సంబంధించిన ఆ ప్ర‌క‌ట‌న‌పై స‌ర్వ‌తా ఆస‌క్తి నెల‌కొన్న‌ది. దేశాన్ని అభ్యున్న‌తి ప‌థంలో న‌డిపేందుకు కేసీఆర్ న‌డుం బిగించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న చేయ‌బోయే ప్ర‌క‌ట‌న‌పై వివిధ రాష్ట్రాల నేత‌లు కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. 11 గంట‌ల‌కు తెలంగాణ భ‌వ‌న్‌లో ఇవాళ ఆ పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం జ‌రగ‌నుంది. ఈ స‌మావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ నేత‌లు హాజ‌ర‌వుతున్నారు. ఆ స‌మావేశంలో తెలంగాణ రాష్ట్ర స‌మితి పూరించ‌బోయే స‌మ‌ర‌శంఖం గురించి సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement