Monday, April 29, 2024

విజయ గర్జన సభ స్థలాన్ని పరిశీలించిన టీఆర్ఎస్ నేతలు

టీఆరెఎస్ పార్టీ రెండు దశబ్దాలు పూర్తి చేసుకున్న సందర్బంగా నవంబర్ 29న వరంగల్ వేదికగా విజయగర్జన సభను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సభా స్థలాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు, మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పార్టీ నేతలు పరిశీలించారు. సభ ప్రాంగణం, పార్కింగ్ స్థలాల ఏర్పాటుపై అధికారులు, స్థానిక నాయకులతో చర్చించారు. విజయ గర్జన సభను విజయవంతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రైతుల సహకారంతో సభా ఏర్పాట్లను నేటి నుండే ప్రారంభించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, నాయకులు, కార్యకర్తలు, కూడా మరియు రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement