Thursday, April 25, 2024

ఆకివీడుని సీఎంకు కానుకగా ఇద్దాం: వైసీపీ శ్రేణులకు మంత్రి పిలుపు

స్థానిక ఎన్నికలు నగరా మోగడంతో వైస్సార్సీపీ అభ్యర్థులు విజయంపై దృష్టి పెట్టారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వైస్సార్సీపీ ముఖ్య నేతలతో ఆకివీడులో సమావేశం నిర్వహించారు. ఆకివీడులో మంత్రి ఆళ్ల నానికి, ఉంగుటూరు MLA పుప్పాల వాసుబాబుకి వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా మంత్రి కార్యకర్తలకు సూచించారు. ఆకివీడు మున్సిపాలిటీలో 20 వార్డ్స్ లో ఘన విజయం సాధించి సీఎం జగన్ కు కానుకగా ఇద్దామని చెప్పారు. ఆకివీడులో వైస్సార్సీపీ శ్రేణులు సమన్వయముతో పని చేసి వైస్సార్సీపీకి అఖండ విజయం చేకూర్చాలని తెలిపారు. ఆకివీడు మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో MLC మోషేన్ రాజు వైస్సార్సీపీ నాయకులు గోకరాజు రామరాజు, నరసింహ రాజు పలువురు వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం.. సీఎం జగన్ కీలక సూచన

Advertisement

తాజా వార్తలు

Advertisement