Monday, April 29, 2024

మల్లన్న దిష్టిబొమ్మ దహనం

ప్రజాప్రతినిధులు, అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. గురువారం పెద్దపల్లి బస్టాండ్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై దిష్టిబొమ్మ దహనం చేసి మల్లన్నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ అక్కా చెల్లెళ్ళ మధ్య జరిగిన భూ వివాదంలో మీడియాను అడ్డం పెట్టుకుని మల్లన్న ప్రజా ప్రతినిధితో పాటు అధికారులను దూషించడం సిగ్గుచేటన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లన్నను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement