Friday, April 26, 2024

కేంద్ర ప్రభుత్వ తీరుపై టీఆర్ఎస్ ఆందోళన..

ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వరంగల్ జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో ఆందోళనల బాటపట్టారు. ఉదయం నుంచే గ్రామాల్లో కేంద్రం దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. కొన్నిచోట్ల రైతులు కల్లాల వద్దే వరిగడ్డితో దిష్టిబొమ్మను రూపొందించి తగులబెట్టారు. కేంద్రం, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. చెన్నరావుపేట మండల కేంద్రంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement