Saturday, May 4, 2024

కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న నేడు టీఆర్ఎస్ కీల‌క స‌మావేశం

సీఎం కేసీఆర్ అధ్యక్ష‌తన ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కీలక స‌మావేశం నిర్వ‌హించ‌నుంది. తెలంగాణ భ‌వ‌న్ లో ఈ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌తన స‌మావేశం ప్రారంభం కానుంది. ఈ స‌మావేశానికి టీఆర్ఎస్ పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధుల తో పాటు కీల‌క నేత‌లు హాజ‌రు కానున్నారు. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా కేంద్ర ప్ర‌భుత్వం పై పోరాటం ఉదృతం చేయ‌డానికి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశముంది. ధాన్యం కొనుగోళ్ల‌ నుంచి బొగ్గు గ‌నులు ప్రయివేటీక‌ర‌ణ వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల పై టీఆర్ఎస్ పార్టీ ఎలా అనుస‌రించాల‌నే దానిపై టీఆర్ఎస్ ప్ర‌జా ప్ర‌తినిధులకు, నేత‌ల‌కు సీఎం కేసీఆర్ దిశా నిర్ధేశం చేయ‌నున్నారు. అలాగే కేంద్రం పై పోరుకు సంబంధించిన భ‌విష్య‌త్తు కార్య‌చ‌ర‌ణ ను కూడా సీఎం కేసీఆర్ వివ‌రించ‌నున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement