Wednesday, May 1, 2024

కార్యకర్తలకు అండగా తెరాస సర్కారు : మంత్రి హ‌రీష్ రావు

సిద్దిపేట ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వం కలిగి వున్న ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించిందని.. పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు ఈ ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తున్నామన్నారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ఐదుగురు కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోయారు. ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున 10 లక్షలు మంజూరయ్యాయని .. పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండేందుకే ఈ బీమా సదుపాయం కల్పించినట్లు తెలిపారు. పార్టీ సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు చనిపోయిన ప్రతి కుటుంబానికి పార్టీ పక్షాన ఇన్సూరెన్స్ చేసి రూ.2 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇప్పటివరకు సిద్దిపేట నియోజకవర్గంలో 25 మంది కార్యకర్తల కుటుంబాలకు ఈ ఇన్సూరెన్స్ చెక్కులు అందించామని, కొత్తగా మరో ఐదుగురు కార్యకర్తకు భీమా మంజూరైంద‌న్నారు. నర్సాపూర్ 2వ వార్డు కు చెందిన మోత్కూరీ నర్సింహులు 24 డిసెంబర్ 2020లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడ‌ని, అతని భార్య మల్లవ్వకు రూ.2లక్షల చెక్కును, మందపల్లి గ్రామానికి చెందిన ఎల్లారెడ్డి రాజీవ్ రహదారి పై 4 డిసెంబర్ 2020 రోజున రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.. భార్య మంజులకు రూ.2లక్షల చెక్కును, ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన బోయిని దేవయ్య 16 డిసెంబర్ 2020 లో చేపలు పెట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు.. భార్య లలిత కు రూ.2 లక్షల చెక్కును, సిద్దిపేట పట్టణం 18వ వార్డు కు చెందిన వరుకోలు రాజు 20 డిసెంబర్ 2020 రోజున రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.. భార్య నిర్మల కు రూ.2 లక్షల చెక్కును, రంగాయ్ పల్లి గ్రామానికి చెందిన దొంతి రాజు 6 మే 2021 రోజున రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.. భార్య కరుణ కు రూ.2 లక్షల చెక్కును అందజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement