Sunday, April 28, 2024

స‌ర్వేకోసం వెళ్లిన‌ తాసిల్దార్ పై.. గిరిజన రైతులు దాడి

మహబూబాబాద్ ప్రతినిధి: తాసిల్దార్ ఇమ్మానుయేల్ పై గిరిజనులు రాళ్లతో దాడి చేశారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాలార్ తండా సమీపంలో కోర్టు కాంప్లెక్స్ కోసం సర్వే చేయడానికి రెవెన్యూ అధికారులతో పాటు తాసిల్దారు కూడా వెళ్ళారు. ఈ నేపద్యంలో అక్కడ ఉండే గిరిజన రైతులు తాసిల్దారు ఇమ్మానుయేల్ తో వాగ్వివాదానికి దిగి.. రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో తాసిల్దార్ తీవ్రంగా గాయపడిన అతనిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. రాళ్లదాడి చేస్తున్న గిరిజన రైతులపై మహబూబాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement