Friday, May 3, 2024

TS | పెద్దఎత్తున త‌హ‌సీల్దార్ల బ‌దిలీ… ఉత్త‌ర్వులు జారీ చేసిన ప్ర‌భుత్వం

తెలంగాణ‌లో పెద్ద ఎత్తున తహసీల్దార్ల బ‌దిలీ జ‌రిగింది. ఈ మేర‌కు ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రెండు మల్టీజోన్ల పరిధిలో 417 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిన్న రాత్రి తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు బదిలీలు చేపట్టగా.. మూడేళ్లకుపైగా పని చేస్తున్న తహసీల్దార్లను బదిలీ చేస్తూ సీసీఎల్‌ఏ ఆదేశాలిచ్చింది. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం బదిలీలు చేపడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement