Saturday, May 4, 2024

TS | సిటీ జాయింట్‌ సీపీగా ఏవీ రంగనాథ్‌! 9మంది ఐపీఎస్‌ అధికారులకు స్థానచలనం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో 9 మంది ఐపీఎస్‌ అధికారులు, ఐదుగురు నాన్‌ కేడర్‌ ఎస్‌పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారంనాడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌ ఎస్‌బీ జాయింట్‌ సీపీగా ఉన్న విశ్వప్రసాద్‌ను ట్రాఫిక్‌ అదనపు సీపీగా నియమించింది. అలాగే సిటీ, క్రైమ్స్‌ జాయింట్‌ సీపీగా ఏవీ రంగనాథ్‌ను నియమించింది. అలాగే వెస్ట్‌జోన్‌ డీసీపీగా ఎస్‌ఎం విజయ్‌కుమార్‌ను నియమించి ఆ స్థానంలో ఉన్న జోయల్‌ డేవిస్‌ను హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ డీసీపీగా బదిలీ చేశారు.

నార్త్‌ జోన్‌ డీసీపీగా రోహిణి ప్రియదర్శిని నియమించిన ప్రభుత్వం, ఆ స్థానంలో ఉన్న చందనాదీప్తిని డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. అలాగే హైదరాబాద్‌ డిటెక్టివ్‌ డిపార్ట్‌మెంట్‌ డీసీపీగా ఎన్‌.శ్వేత, హైదరాబాద్‌ ట్రాఫిక్‌-1 డీసీపీగా సుబ్బరాయుడులను నియమించింది. ప్రస్తుతం ట్రాన్స్‌పోర్ట్‌ డీసీపీగా ఉన్న నితికపంత్‌, సీసీఎస్‌ జాయింట్‌ సీపీగా ఉన్న గజరావ్‌ భూపాల్‌లను డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

నాన్‌ కేడర్‌ ఎస్‌పీలు

రాష్ట్రంలో ఐదుగురు నాన్‌ కేడర్‌ ఎస్‌పీలను బదిలీ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ-3గా వెంకటేశ్వర్లును నియమించారు. ఆ స్థానంలో ఉన్న డి.శ్రీనివాస్‌ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేసింది. రాచకొండ రోడ్‌ సేఫ్టీ డీసీపీగా ఉన్న శ్రీ బాలదేవిని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ, మాదాపూర్‌ డీసీపీ గోనె సందీప్‌ను రైల్వే ఎస్‌పీ అడ్మిన్‌గా నియమించారు. రైల్వే ఎస్‌పీ అడ్మిన్‌గా ఉన్న రాఘవేందర్‌రెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేసినట్లు హోం శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement