Monday, April 29, 2024

TS : హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు…

ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన దృష్ట్యా హైదరాబాద్‌లో సంబంధిత విభాగ అధికారులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. అమిత్‌షా రోడ్డు మార్గంలో వెళ్లి చార్మినార్‌ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకుంటారు.

- Advertisement -

అనంతరం సికింద్రాబాద్‌, ఎల్బీస్టేడియం, బేగంపేట తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని అధికారులు తెలిపారు. ఆయా మార్గాల్లో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement