Thursday, April 25, 2024

వైఎస్ కు టీ.పీసీసీ చీఫ్ రేవంత్ ఘన నివాళి

దివంతగ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్, అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు వైఎస్ కు నివాళి అర్పించారు. వైఎస్ జయంతి పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట సెంటర్ వద్ద వైఎస్ విగ్రహానికి టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయనతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు వైఎస్ విగ్రాహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: షర్మిల పార్టీకి కాంగ్రెస్ ఎంపీ మద్దతు!

Advertisement

తాజా వార్తలు

Advertisement