Thursday, April 25, 2024

షర్మిల పార్టీకి కాంగ్రెస్ ఎంపీ మద్దతు!

తెలంగాణలో కొత్త పార్టీని ప్రకటించనున్న వైఎస్ షర్మిలకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. షర్మిల పార్టీకి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. గురువారం ఉదయం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సభ జరుగనున్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఆగి వైఎస్సార్ అభిమానులతో ఎంపీ కోమటిరెడ్డి ముచ్చటించారు. పార్టీ ఆవిర్భావ వేడుకకు రావాలని తనకు ఆహ్వానం పంపారని ఆయన తెలిపారు. వైఎస్ గొప్ప నేత అని కొనియాడారు. వైఎస్ జయంతి సందర్భంగా భువనగిరిలో ఆయనకు నివాళులు అర్పించేందుకు వెళ్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కాగా, నేటి సాయంత్రం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ వేడుక జరగనుంది.

ఇది కూడా చదవండి: ఇడుపులపాయలో షర్మిల.. వేర్వేరు దారుల్లో అన్నా చెల్లెలు!

Advertisement

తాజా వార్తలు

Advertisement