Sunday, April 28, 2024

పటాన్‌చెరువులో రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి

హైదరాబాద్ నగరం శివారులోని పటాన్‌చెరువులో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్‌చెరువు మండలం ఇస్నాపూర్‌ వద్ద ఓ బైక్‌ను టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో బైకుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విషాదం

Advertisement

తాజా వార్తలు

Advertisement