తొర్రూర్ టౌన్ అక్టోబర్ 11(ప్రభ న్యూస్ )మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో విస్తృతంగా పోలీసుల తనిఖీలు చేస్తున్నారు. బుధవారం తొర్రూరు పట్టణ కేంద్రంలో బస్సులో వెళ్తూన వ్యక్తి నుండి 3 లక్షల రూపాయలు, అదేవిదంగా కారును తనిఖీ చేయగా 5 లక్షల రూపాయలు ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న మొత్తం ఎనిమిది లక్షల నగదు పట్టుకున్నట్లు తొర్రూర్ ఎస్సై జగదీశ్ తెలిపారు. దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎస్సై జగదీశ్ మాట్లాడుతూ వాహనాలలో వెళ్తున్న వ్యక్తులు, అధిక నగదు బంగారం వెండి తో ప్రయాణిస్తున్నట్లయితే వాటి విలువకు తగిన రసీదులు ఉండాలని లేనిచో స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు