Friday, April 26, 2024

Breaking: తెలంగాణలోని ఆ మూడు జిల్లాల్లో రేపు సెలవు..

వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రేపు మూడు జిల్లాలకు సెలవు ప్రకటించింది. రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలతో పాటు హైదరాబాద్‌ జంటనగరాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే శుక్రవారానికి బదులుగా నవంబర్ నెల 12న రెండో శనివారాన్ని పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement