Thursday, April 18, 2024

ఈ మార్గంలో ప‌లు రైళ్ల రద్దు..

నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా కాజీపేట మార్గంలో రాకపోకలు సాగించే సికింద్రాబాద్‌-గుంటూరు-సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీ రైళ్లని రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారి వెల్లడించారు. నెంబరు. 12705 గుంటూరు – సికింద్రాబాద్‌, నెంబరు. 12706 సికింద్రాబాద్‌ – గుంటూరు రైళ్లని ఈ నెల 8 నుంచి 20వ తేదీ వరకు రద్దు చేస్తున్నామన్నారు. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా గుంటూరు మీదుగా నాలుగు ప్రత్యేక రైళ్లని నడపనున్నట్లు డివిజనల్‌ రైల్వే అధికారి తెలిపారు. నెంబరు. 07153 నరసపూర్‌ నుంచి యశ్వంత్‌పూర్‌ వెళ్లే రైలు ఈనెల 9, 11 తేదీల్లో మధ్యాహ్నం 3.10కి బయలుదేరి రాత్రి 7.50కి గుంటూరు చేరుకొంటుందని వివరించారు. నెంబరు.07154 యశ్వం త్‌పూర్‌ నుంచి నరసపూర్‌ వెళ్లే రైలు ఈనెల 10, 12 తేదీల్లో మధ్యాహ్నం 3.50కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 3.35కి గుంటూరుకు చేరుకుంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement