Tuesday, April 30, 2024

Tollywood : డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్ట్.. ఆరు కేసులు కొట్టివేత..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. టాలీవుడ్‌ను ఒక్క కుదుపు కుదిపిన ఈ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం జరిగింది. 2018లో నమోదైన కేసుల్లో ఎక్సైజ్ శాఖకు బిగ్ షాక్ తగిలింది. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ఆధారంగా నాంపల్లి కోర్టు మొత్తం ఎనిమిది కేసుల్లో ఆరు కేసులను కొట్టివేసింది.

పూరీ జగన్నాథ్, తరుణ్‌ల శాంపిల్స్‌లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్‌ఎస్‌ఎల్ తేల్చింది. కాగా, ఈ కేసులో ఎక్సైజ్ శాఖ నెలల తరబడి టాలీవుడ్ ప్రముఖులను విచారించింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అప్పటి ప్రభుత్వం ప్రత్యేక సిట్‌ను సైతం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా 6 కేసుల్లోనూ సాక్ష్యాధారాలు లేవని కోర్టు కొట్టివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement