Thursday, May 16, 2024

నేడు హైదరాబాద్ లో నీడ మాయం

హైదరాబాద్ : నగరంలో నేడు అరుదైన ‘జీరోషాడో’ ఆవిష్కృతం కాబోతోంది. మధ్యాహ్నం 12.12 నుంచి 12.14 గంటల వరకు అంటే 2 నిమిషాల వ్యవధిలో నీడ మాయం కానుంది

సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎండలో నిటారుగా(90 డిగ్రీల) ఉంచిన వస్తువుల మీద రెండు నిమిషాలు నీడ కనిపించదని బిర్లా సైన్స్‌ సెంటర్‌ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.రోజూ సూర్యుడు మధ్యాహ్నం తలమీదుగా వెళ్తున్నట్టు కన్పిస్తున్నా జీరో షాడో ఉండదని అధికారులు తెలిపారు. భూమి గోళాకారంగా ఉండటం వల్ల సూర్యకిరణాలు మధ్యాహ్నం భూమధ్యరేఖపై మాత్రమే పడతాయి. దానికి ఉత్తరాన, దక్షిణాన నేరుగా పడవు అని వివరించారు. సూర్యుని గమనం ఉత్తరాయణంలో 6 నెలలు ఉత్తర దిశగా, దక్షిణాయనంలో 6 నెలలు దక్షిణ దిశగా ఉంటుంది. ఈ సమయంలో భూమి వంపు సుమారు 23.5 డిగ్రీలు ఉండటంతో భూమధ్య రేఖకు అన్ని డిగ్రీల ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో సూర్యుడు మధ్యాహ్నం నేరుగా తలమీద నుంచి వెళ్తాడని వివరించారు. ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయణంలో ఒకసారి చొప్పున ఏడాదికి రెండుసార్లు జీరోషాడో మూవ్‌మెంట్‌ ఉంటుందని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement