Monday, April 29, 2024

Tirumalagiri – తల్లిని నరికి వేసిన సైకో….

భూపాలపల్లి/ రేగొండ (ప్రభన్యూస్):జయశంకర్ జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో దారుణం జరిగింది. సైకో వీరంగంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందగా మరో మహిళకు తీవ్ర గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది.

స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రేగొండ మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన కంచరకుంట్ల రాజిరెడ్డి మతిస్థిమితం లేని వ్యక్తి గురువారం రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో తన తల్లి కంచరకుంట్ల హైమావతిని గొడ్డలితో అతికిరాతకంగా నరికి చంపాడు. గోడువను చూసి బయటికి వచ్చిన ఇంటి పక్కన ఉన్న ఊకంటి లలిత పై దాడి చేయగా తీవ్ర గాయాలై చావు బతుకుల మధ్య ఉంది.

చికిత్స నిమిత్తం ఎంజీఎం కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తల్లిని చంపి ఇంటి పక్క వారిపై దాడి చేసి పారిపోతుండగా గోరుకొత్తపల్లి మండలం చిన్నకోడపాక గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజిరెడ్డిని ఆ గ్రామస్తులు దొంగగా భావించి అదుపులోకి తీసుకొని తాళ్లతో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement