Wednesday, May 1, 2024

TS: ఎస్సారెస్పీ కాలువలో… ముగ్గురు యువకుల గల్లంతు..

ఎస్సారెస్పీ కాలువలో పడి ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా మెండోరా మండల పరిధిలో ఘోరం జరిగింది. ఎస్సారెస్పీ లక్ష్మీ కాలువలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మండల పరిధిలోని జాక్రాన్‌పల్లి గన్యతండాకు చెందిన లోకేష్, సాయినాథ్, మున్నాలు ఆటవిడుపుగా ఎస్సారెస్పీ లక్ష్మీ కాలువలోకి దిగారు.

ఈ క్రమంలో ఈత రాని వారు నీటిలో పడి గల్లంతయ్యారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న రెస్క్యూ టీం ముగ్గురు యువకులు ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement