Thursday, May 2, 2024

Cash Seized – బంజారాహిల్స్ చెక్ పోస్ట్ త‌నిఖీల‌లో మూడున్న‌ర కోట్లు ప‌ట్టివేత

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎన్నిక‌ల అధికారులు, పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో శ‌నివారం ఉద‌యం బంజారాహిల్స్‌లో త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ త‌నిఖీల్లో ఏఎమ్మార్ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ మ‌హేశ్ రెడ్డి కారులో రూ. 3.50 కోట్లు ప‌ట్టుబ‌డ్డాయి. ఆ న‌గ‌దుకు సంబంధించి ఎటువంటి రశీదు లేకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించారు. ఆయన పక్క రాష్ట్రాల నుంచి డబ్బులు తీసుకొచ్చి రాజకీయ పార్టీలకు అందజేస్తున్నట్లు తేలింది. దాంతో ఆయనకు సంబంధించిన ఏఎమ్మార్ గ్రూప్‌ సంస్థల్లో కూడా తనిఖీలు చేపట్టారు. మహేష్ రెడ్డి ఏ పార్టీ కోసం డబ్బులు తెస్తున్నారనే దానిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement