Sunday, May 19, 2024

Thorrur : గ్రూప్-1 పరీక్షకు ఆలస్యం.. అభ్యర్థులకి నో ఎంట్రీ

తొర్రూర్ టౌన్ ( ప్రభన్యూస్ ) ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం చేపట్టిన గ్రూప్ వన్ పరీక్ష తొర్రుర్ పట్టణంలో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల సెంట్ పాల్స్ హై స్కూల్లో ఉదయం ప్రారంభమయ్యాయి. కాగా సమత డిగ్రీ కాలేజీ గ్రూప్ వన్ పరీక్ష కేంద్రం వద్ద ఉదయం 10 గంటల 15 నిమిషాలు దాటిన తర్వాత ఇతర అభ్యర్థులు బయ్యారంకు చెందిన మధు,నరసింహులపేట మండలం దాట్ల గ్రామానికి చెందిన మరో అభ్యర్థి ఆలస్యంగా రావడంతో గేటు వద్దనే ఉన్న తనిఖీ బృందం అధికారులు, పరీక్షల నిర్వహణ అధికారులు అనుమతి నిరాకరించడంతో వారు తిరిగి వెళ్ళిపోయారు. కాగా పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తును సీఐ సత్యనారాయణ నేతృత్వంలో పర్యవేక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement