Sunday, April 28, 2024

వ్యాసరచన పోటీలో విజేత‌లు వీరే.. పురస్కారాలు అందజేసిన డీజీపీ మహేందర్ రెడ్డి

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల (ఫ్లాగ్ డే ) సందర్బంగా రెండు విభాగాల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన పోలీసు అధికారులకు తెలంగాణ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి ఇవ్వాల (సోమ‌వారం) నగదు పురస్కారాలను అందజేశారు. డీజీపీ కార్యాలయంలో ఇవ్వాల సాయంత్రం నిర్వహించిన బహుమతుల ప్రదాన కార్యక్రమంలో సీఐడీ విభాగం డిజి గోవింద్ సింగ్, అడిషనల్ డిజిలు జితేందర్, శివధర్ రెడ్డి, అభిలాష బిస్త్, విజయ కుమార్, నాగి రెడ్డి పాల్గొన్నారు. ఈ విజేతలకు ప్రధమ బహుమతిగా రూ. 20 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 15 వేలు, తృతీయ బహుమతిగా రూ. 10 వేళా పురస్కారాలను డిజిపి మహేందర్ రెడ్డి అందచేసి అభినందించారు.

వ్యాసరచన పోటీల్లో విజేతల వివరాలు..
ఆర్.ఎస్.ఐ/ ఎస్.ఐ ల స్థాయి కన్నా పైస్థాయి అధికారుల విభాగంలో విజేతలు.

1 . కొత్తపల్లి అశోక్ కుమార్, ఏ.ఎల్.ఐ, పిటిసీ, వరంగల్ – ప్రథ‌మ బహుమతి.
2 . సునీత మోహన్, అడిషనల్ ఎస్.పి., ప్రిన్సిపాల్,పిటిసి, కరీంనగర్. – ద్వితీయ బహుమతి
3 . ఎల్. శ్రవంతి, ఆర్.ఎస్.ఐ., సి.ఏ.ఆర్ హెడ్ క్వార్టర్స్, నిజామాబాదు కమిషనరేట్. – తృతీయ బహుమతి.

- Advertisement -

ఏ.ఆర్.ఎస్.ఐ/ ఏ.ఎస్.ఐ ల కన్నాదిగువ స్థాయి అధికారుల విభాగంలో విజేతలు.

1 . ఏ. రాజేష్, పీసీ-3352 , బెల్లంపల్లి ౧ టౌన్, రామగుండంకమీషనరేట్ – ప్రథ‌మ బహుమతి.
2 . పి. అరుణ కుమారి, WPC 2399 , సదాశివ్ పెట్ పి.ఎస్, సంగారెడ్డి జిల్లా – ద్వితీయ బహుమతి.
3 . టి . సంపత్, పీసీ- 2067 , కాళేశ్వరం పీ.ఎస్. జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా – తృతీయ

Advertisement

తాజా వార్తలు

Advertisement