Monday, April 29, 2024

ఈ ఏడాది థర్డ్ వేవ్ ఉండదు: తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు

కరోనా సెకండ్ వేవ్ కంట్రోల్ లోకి వస్తోంది.. అయితే నిపుణులు థర్డ్ వేవ్ గురించి ముందు నుంచే హెచ్చరిస్తున్నారు..కొన్ని నివేదికలు వచ్చే నెలలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశముందని హెచ్చిరించాయి..అందుకు తగ్గట్లు ప్రభుత్వాలు కూడా సిద్దమవుతున్నామని ప్రకటిస్తున్నాయి…కాని తెలంగాణలో మాత్రం ఇప్పుడిప్పుడే కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదని తేల్చి చేప్పారు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి. శ్రీనివాస రావు..మన దేశంలో వెలుగు చూసిన కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ఇప్పుడు విదేశాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తోందని జి. శ్రీనివాసరావు అన్నారు. వైరస్ తీవ్రంగా ప్రభావం చూపిన తర్వాత పుట్టే కొత్త వైరస్‌లు బలహీనంగా ఉంటాయని పేర్కొన్నారు. కాబట్టి వాటి ప్రభావం అంతంత మాత్రమేనని అన్నారు.

ఇక ఈ ఏడాది డిసెంబరు నాటికి తెలంగాణలో మూడో దశ వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉద్ధృతి కనిపించినా దాని తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని, కాబట్టి థర్డ్ వేవ్‌పై ఆందోళన అవసరం లేదన్నారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం కరోనా నిబంధనలను పాటించాల్సిందేనని డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు.

ఇది కూడా చదవండి:కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా

Advertisement

తాజా వార్తలు

Advertisement