Saturday, May 18, 2024

సింగారంలో 13 ఇళ్లల్లో చోరీ

ప్రభన్యూస్, ప్రతినిధి/యాదాద్రి – ఒకే రోజు రాత్రి 13 ఇళ్లల్లో చోరీ జరిగిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సింగారం గ్రామంలో 13 ఇళ్లల్లో చోరీ జరిగినట్లు ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో దుర్గమ్మ పండుగ జరుగగా గ్రామంలో పలు కుటుంబాలు పండుగకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఎవ్వరు లేని ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. కొంత నగదు, బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు, వివరాలను సేకరిస్తూ, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement