ప్రభన్యూస్, ప్రతినిధి/యాదాద్రి – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగడుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు మీదుగా కొలనుపాక కు కొనసాగుతుంది. కష్టజీవుల కలుస్తూ.. వారి కష్టాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
పాదయాత్రలో భాగంగా ఆలేరునుంచి బయలుదేరిన భట్టి విక్రమార్క వద్దకు టైర్ పంక్చర్ వేసుకునే సామా రమేష్ కలసి తమ కష్టాలను చెప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాకు అన్నీ సంక్షేమ పథకాలు అందేవని, ఇప్పుడు ఏమీ అందడం లేదని వాపోయారు. జీవించడం కూడా చాలా కష్టంగా ఉందని రోదిస్తూ తెలిపారు. వచ్చే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అందరికీ మేలు జరుగుతుందని భట్టి హామీ ఇచ్చారు. అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు యాత్రలో పాల్గొన్నారు.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2023/05/image.png)