Monday, May 6, 2024

Breaking | రైలింజ‌న్ ఎక్కి వృద్ధుడి హల్​చల్​.. విద్యుత్ వైర్ల‌ను పట్టుకోవ‌డంతో షాక్!

తాండూరు, (ప్ర‌భ న్యూస్‌): ఓ వృద్ధుడు ట్రైన్ ఎక్కి హల్ చల్ చేశాడు. అంతటితో ఆగకుండా ఇంజన్ పైన ఉన్న విద్యుత్ వైర్లను పట్టుకునే యత్నం చేశాడు. దీంతో షాక్ తగిలి కిందపడడంతో ప్రాణాపాయాన్ని తప్పించుకున్నాడు. ఈ ఘటన ఇవ్వాల (శుక్రవారం) సాయంత్రం వికారాబాద్​ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్లో జ‌రిగింది.

తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటక రాష్ట్రం చించాలి తాలుకాలోని కల్లూరు గ్రామానికి చెందిన కొండం చంద్రశేఖర్(60) తాండూరు రైల్వే స్టేషన్లో ఆగా ఉన్న హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ ఇంజన్ పైకి ఎక్కాడు. మతిస్థిమితం లేకపోవడంతో ఇంజన్ పైన వేలాడే విద్యుత్ వైర్లను పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో షాక్ తగిలి కిందపడి గాయాలపాలయ్యాడు. గాయాలతో ప్రాణాపాన్ని తప్పించుకున్నాడు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అత‌డిని చికిత్స నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement