Sunday, May 19, 2024

మోడల్ రైతు బజార్ కు నిధులు కేటాయించిన‌ మంత్రి కేటీఆర్

రామచంద్రపురం : భారతి నగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీలో నిర్మాణ దశలో ఉన్న మోడల్ రైతు బజార్ కు అదనపు నిధులు కావాలని కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి మంత్రి కేటీఆర్ ను కోరారు. గురువారం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి మంత్రి కేటీఆర్ ను కలిసి డివిజన్ లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. అనంతరం బొంబాయ్ కాలనీలో నిర్మాణ దశలో ఉన్న మోడల్ రైతు బజార్ లో పలు పనులు చేయాల్సి ఉందని, అందుకు మరిన్ని నిధులు కావాలని కోరగా రెండున్నర కోట్ల రూపాయలను మంత్రి కేటీఆర్ మంజూరు చేశారు. వీటితో పాటు మరో కోటిన్నర రూపాయలు సీసీ రోడ్ల గురించి మంజూరు చేసినట్టు కార్పొరేటర్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement