Sunday, May 5, 2024

ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసుపై విచారణ రేప‌టికి వాయిదా..

ఆదిభట్ల యువతి వైశాలి కిడ్నాప్ కేసుపై ఈరోజు ఇబ్రహీంపట్నం కోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నవీన్ రెడ్డి తరపున లాయర్ విష్ణువర్ధన్ రెడ్డి వాదనలు వినిపించారు. వైశాలి – నవీన్ రెడ్డి మధ్య జరిగిన పరిణామాలను కోర్టుకు వివరించారు. వైశాలిని కిడ్నాప్ చేయాలనే ఉద్దేశం నవీన్ రెడ్డికి లేదని తెలిపారు. నవీన్ రెడ్డి నుంచి సుమారు ఐదారు లక్షల వరకు వైశాలి వాడుకుందని అడ్వొకేట్ కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోర్టు వెల్లడించింది. అనంతరం తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement