Wednesday, April 17, 2024

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేల‌ది కీలక పాత్ర‌.. స‌జ్జ‌ల

ఈ మూడేళ్లలో ఆయా కుటుంబాల్లో వచ్చిన మార్పులు వివరించడం కోసమే గడప గడపకు కార్యక్రమ‌మ‌ని, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలది కీలక పాత్ర అని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజల దగ్గరకు వెళ్లడమే తమ ఎజెండా అని వివరించారు. ప్రజల్లో తిరిగితేనే గ్రాఫ్ పెరుగుతుందని సజ్జల స్పష్టం చేశారు.

సీఎం జగన్ ఎవరి మీద సీరియస్ అయ్యారని నెగటివ్ గా చూడాల్సిన అవసరం లేదన్నారు. చేసే పనిని శ్రద్ధగా చేయమని సీఎం చెప్పారని అన్నారు. ప్రజల్లో తిరిగితేనే గ్రాఫ్ పెరుగుతోందని.. సర్వేలలో కూడా వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 స్థానాలు గెలిచే విధంగా సమావేశం చేస్తున్నామని సజ్జల స్పష్టం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement