Monday, April 29, 2024

TS: ఒక‌టో తేది వెళ్లిపోయింది.. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏది – రేవంత్ ను ప్ర‌శ్నించిన కిష‌న్ రెడ్డి..

హైద‌రాబాద్ – తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీ ప్రకారం నిన్న ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ రాకపోవడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.. నోటీస్ విడుదల చేయకుండా ప్రజలను మోసం చేయడంలో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ యువతను మోసం చేసిందని మండిపడ్డారు. బీజేపీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న‌ అధ్యక్షతన నేడు పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించారు.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ… ఎన్నికల వాగ్దానంలో భాగంగా.. ఫిబ్రవరి 1వ తేదీన తెలంగాణ నిరుద్యోగ యువత కోసం కోసం గ్రూప్-1 నోటిఫికేషన్ వేస్తామని.. అట్టహాసంగా వార్తా పత్రికల మొదటి పేజీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది కదా అన్నారు. మరి నిన్ననే ఒకటో తేది.. ఇది ఫిబ్రవరి నెలే కదా అని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సమయం దాటిపోయింద‌ని, మరి ఇంతవరకైతే నోటిఫికేషన్ రాలేదని కేంద్రమంత్రి గుర్తు చేశారన్నారు. నమ్మి ఓటేసిన తెలంగాణ యువతను నిట్టనిలువునా మోసం చేసిందన్నారు. యువతను మోసం చేసినట్లే.. ఇతర వాగ్దానాలనూ వ్యూహాత్మకంగా దాటవేసే ప్రయత్నం జరుగుతోందని కిషన్ రెడ్డి మండిప‌డ్డారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement