Sunday, May 12, 2024

Ind vs Eng, 2nd Test : టీ బ్రేక్.. భార‌త్ స్కోర్.. 225/3

విశాఖ‌ప‌ట్నంలోని వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన భార‌త్ జ‌ట్టు టీ బ్రేక్ స‌మ‌యానికి మూడు వికెట్లు కోల్పోయి 225 ప‌రుగులు చేసింది.

భార‌త్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 14 ప‌రుగులు చేసి ఔట్ కాగా.. ఆ త‌ర్వాత శుభ‌మాన్ గిల్ 34 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అలాగే శ్రేయ‌స్ అయ్య‌ర్ 27 ప‌రుగులు చేసి పెవిలియ‌న్ కు చేరుకున్నాడు. టీ బ్రేక్ స‌మ‌యానికి య‌శ‌స్వి జైస్వాల్ 125 ప‌రుగులు, ర‌జత్ ప‌టిదార్ 25 ప‌రుగుల‌తో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లండ్ బౌల‌ర్లు అండ‌ర్స‌న్, బ‌షీర్, హార్ట్ లీ లు ఒక్కో వికెట్ చొప్పున‌ తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement