Thursday, May 2, 2024

TS | తాగిన మైకంలో పిల్లలకు పురుగుల మందు పోసిన తండ్రి.. బాలుడి మృతి

మహబూబాబాద్ క్రైమ్ (ప్ర‌భ‌న్యూస్‌) : మహబూబాబాద్ జిల్లాలో ఘోరం జ‌రిగింది. తాగిన మైకంలో ఇద్దరు చిన్నారులకు పురుగుల మందు తాగించాడో తండ్రి. ఈ ఘటన మహబూబాబాద్ మండలంలోని అమనగల్ శివారు బలరాం తండాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. బలరాంతండాకు చెందిన పెద్దపులి రమేష్ కు ముగ్గురు పిల్లలున్నారు. ఇందులో ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. రమేష్ నిత్యం మద్యం తాగుతాడ‌ని తండావాసులు చెబుతున్నారు.

అయితే.. కొద్ది రోజుల క్రితం రమేష్ వేధింపులు తట్టుకోలేక అత‌ని భార్య తల్లి గారింటికి వెళ్లింది. కాగా, గురువారం రాత్రి తాగిన మైకంలో ర‌మేశ్ త‌న ఇద్దరు చిన్నారులకు పురుగుల మందు తాగించాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే వారిని చికిత్స కోసం మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి తరలించారు. కాగా, చిన్న కుమారుడు చికిత్స పొందుతూ చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement