Thursday, May 2, 2024

అదుపుత‌ప్పి దూసుకొచ్చిన డీసీఎం వ్యాన్‌.. రోడ్డుప‌క్క‌న ఉన్న వ్య‌క్తికి తీవ్ర‌గాయాలు

ఖమ్మం జిల్లాలో యాక్సిడెంట్ జ‌రిగింది. కొణిజర్ల మండలం పల్లిపాడు సమీపంలో అదుపు త‌ప్పిన డీసీఎం వ్యాను రోడ్డు పక్కన వెయిట్ చేస్తున్న వ్యక్తిపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ములకలపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన చేరగ చెన్నకేశవరావుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల స‌మాచారంతో వెంట‌నే అత‌డిని పోలీసులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం చెన్న‌కేశ‌వ‌రావుకు ట్రీట్‌జ‌రుగుతోంద‌ని, త‌దుప‌రి ప‌రిస్థితి ఏంట‌న్న‌ది డాక్ట‌ర్లు ఇంకా తెలియ‌జేలేదు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అందాల్సి ఉంది. కేసు న‌మోదు చేసి పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement