Sunday, May 5, 2024

దేశాన్ని పంట కాలనీలుగా విభజించాలి : మంత్రి నిరంజ‌న్ రెడ్డి

దేశాన్ని పంట కాల‌నీలుగా విభ‌జించాల‌ని రాష్ట్ర మంత్రి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. షిరిడీ ప్రాంతంలో వర్షపాతం వివరాలు, పంటల రకాలు, సాగునీటి వసతి, పంటల మార్కెటింగ్ పై రైతులతో ఆరా తీయడం జరిగింది. ఈసంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… దేశంలో రైతు కష్టానికి తగిన ఫలితం దక్కాలంటే దేశంలో ఏ పంట ఎంత అవసరం అన్న ప్రణాళిక ఉండాలన్నారు. కానీ కేంద్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంద‌న్నారు. దేశాన్ని పంట కాలనీలుగా విభజించి పంటల సాగుకు మార్గదర్శనం చేయాలన్నారు. రైతుకు న్యాయం జరిగేలా ఉండాలి .. రైతుకు ఎంత చేసినా తక్కువేన‌న్నారు. పంటల మార్కెటింగ్, ఎగుమతుల విషయంలో రైతుకు సాయం చేయాల్సిన కేంద్రం చేటు చేస్తుంద‌న్నారు. భవిష్యత్ తరాలు వ్యవసాయం వైపు మళ్లాలన్నారు.యువత వ్యవసాయంలో తమదైన ముద్ర వేయాలన్నారు. తెలంగాణలో పంటల వైవిద్యీకరణ కోసం పెద్ద ఎత్తున కృషిచేస్తున్నామ‌న్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు రైతుబంధు, రైతుభీమా, 24 గంటల కరెంటు ఇస్తూ వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం సమూలంగా మారిపోయిందన్నారు.


పంటల మార్పిడితో రైతులు లాభాలు గడించాలన్నది త‌మ ఉద్దేశమ‌న్నారు. మహారాష్ట్ర జాల్నా ప్రాంతంలో వ్యవసాయ ఉద్యాన పంటల పరిశీలనకు వచ్చామ‌న్నారు. తెలంగాణలో పంట మార్పిడి కోసం ఇప్పటికే కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు పర్యటించడం జరిగిందన్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు, వాటి ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పరిశీలనకు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా అహ్మద్ నగర్ జిల్లా శిరిడీ సమీపంలో ద్రాక్ష, జామ తోటలు పరిశీలించి స్థానిక వ్యవసాయ, ఉద్యాన అధికారులు, రైతులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మన ప్రియతమ నాయకులు, భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఉద్యానవన శాఖ డైరెక్టర్ వెంకట్రామి రెడ్డి, ఉద్యానశాఖ జేడీ సరోజినిదేవి, అసిస్టెంట్ డైరెక్టర్ సుభాషిణి, తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement