Friday, April 26, 2024

అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని శ్రీ వేంకటేశ్వర కాలనీ వెస్ట్ సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ ను తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి చేయించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తమ కాలనీలో మిగిలిన సీసీరోడ్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వెంకట నర్సింహా రెడ్డి, జనరల్ సెక్రెటరీ సతీష్ చక్రవర్తి, ట్రెజరర్ భాస్కర్ రావు, వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ గంగాధర్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, అడ్వైజ‌ర్లు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement