Sunday, May 5, 2024

ఓటర్లందరికీ కృతజ్ఞతలు.. టీఆర్ ఎస్‌ గెలుపు లాంఛనమే: ఎమ్మెల్సీ అభ్యర్థి రమణ

ఓటరు దేవుళ్లు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని టీఆర్ ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్.రమణ పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ తెరాస గెలుపు లాంఛనమేనని ప్రతిపక్షాలకు ఈనెల 14వ తేదీన మరోసారి దిమ్మదిరిగే ఫలితాలు వస్తాయన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలకు ప్రజలు తెరాసకు వెన్నంటి ఉన్నారన్నారు రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలు పై కేంద్రం పై పోరాటం చేస్తామన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement