Tuesday, May 21, 2024

Thanks Meet – కృతజ్ఞతల వెల్లువ వాన జల్లులో త‌డిసి ముద్దైన కెసిఆర్ – వీడియోతో

హైద‌రాబాద్ – తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపి, గుణాత్మక ప్రగతి కార్యాచరణను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేడు మరోసారి కృతజ్ఞతల వెల్లువ వాన జల్లులో త‌డిసి ముద్ద‌య్యారు.. ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హాజరైన శాసన సభ్యులు సీఎంను వారి ఛాంబర్ లో కలిసి, రైతు సంక్షేమం, ప్రజా సంక్షేమం దిశగా మరోసారి పలు ప్రగతి నిర్ణయాలు తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలతో పాటు, నిన్న తీసుకున్న రైతు రుణమాఫీ నిర్ణయానికి కృతజ్ఞతాభినందనలు తెలిపారు. దాంతో అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ గురువారం నాడు సందడి నెలకొంది. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు సీఎంకు పుష్పగుచ్చాలు అందించారు. తమ నియోజకవర్గ రైతుల తరఫున ప్రజల పక్షాన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

రైతు రుణమాఫీతో పాటు హైదరాబాద్ లో మెట్రోరైలు విస్తరణ, నోటరీ ఆస్తుల క్రమబద్ధీకరణ నిర్ణయం, తదితర అభివృద్ధి సంక్షేమ నిర్ణయాల నేపథ్యంలో సీఎంకు కృతజ్ఞతాభినందనలు వెల్లువెత్తాయి. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి @SingireddyBRS రైతు రుణమాఫీ చేసినందుకు వ్యవసాయ శాఖ తరపున, తెలంగాణ రైతాంగం తరఫున సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. వారితో పాటు మంత్రులు వి శ్రీనివాస గౌడ్ @VSrinivasGoud , చామ‌కూర మ‌ల్లారెడ్డి @chmallareddyMLA లుకూడా ముఖ్య‌మంత్రికి ధ‌న్య‌వాదాలు చెప్పారు.

ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రైతు కుటుంబాలంతా సంబరాలు జరుపుకుంటున్నారని సీఎంకు తెలిపారు. వ్యవసాయ రైతు పక్షపాతిగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం నిలిచిందనీ, రైతు బాంధవుడుగా సీఎం కేసీఆర్ మరోసారి నిలిచారని, రుణమాఫీ సంపూర్ణం చేసిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదని వారు కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement