Tuesday, May 21, 2024

HYD : ఆదయ్య నగర్ లో తలసానికి జననీరాజనాలు

సికింద్రాబాద్, నవంబర్ 2(ప్రభ న్యూస్): సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదయ్య నగర్ లో ఎన్నికల ప్రచారం అదుర్స్ అన్పించింది. తలసాని కి మహిళలు మంగళహరతులతో ఘన స్వాగతం పలికారు.

ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. బస్తీలో పుట్టి పెరిగిన వ్యక్తి కావడంతో ప్రతి ఒక్క‌రు ఆయనను అప్యాయంగా పలకరించారు. తలసాని కూడా ప్రతి ఒక్క‌రి ఇంటికి వెళ్లి పలకరించడం కన్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement