Thursday, May 2, 2024

జులై 1న టెట్ ఫలితాలు విడుదల

ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌(టెట్‌) పరీక్ష జూన్ 12న నిర్వ‌హించిన విషయం తెలిసిందే. అయితే టెట్ ఫ‌లితాల విడుద‌ల‌కు ముహుర్తం ఖ‌రారైంది. జులై 1వ తేదీన టెట్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో విద్యాశాఖ ప‌నితీరుపై స‌బితా ఇంద్రారెడ్డి త‌న కార్యాల‌యంలో ఈరోజు స‌మీక్ష నిర్వ‌హించారు. టెట్ ఫ‌లితాల వెల్ల‌డిలో జాప్యానికి ఆస్కారం లేకుండా జులై 1న విడుద‌ల చేయాల‌ని ఆమె ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement